టీ20ల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ధనాధన్ ఫార్మాట్లో వరుసగా 13 విజయాలు సాధించిన ఫస్ట్ కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్తో జరిగిన మొదటి టీ20లో గెలవడం ద్వారా రోహిత్ ఈ ఘనత సాధించాడు.
? Milestone Alert ?
— BCCI (@BCCI) July 7, 2022
First captain to win 1⃣3⃣ successive T20Is - Congratulations, @ImRo45. ? ?#TeamIndia | #ENGvIND pic.twitter.com/izEGfIfFTn
2011లో కోహ్లీ నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. రోహిత్ శర్మ జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన సిరీస్లలో టీమిండియా విజయం సాధించింది. క్లీన్స్విప్లతో దడదడలాడించింది.
తాజాగా ఇంగ్లాండ్ టూర్తో రెగ్యులర్ కెప్టెన్గా రోహిత్ మారిపోయాడు. ఫస్ట్ టైం విదేశీ గడ్డపై భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే జట్టు విజయం సాధించడంతో..వరల్డ్ రికార్డు సృష్టించాడు.