రూ. 5 కోట్ల విలువైన ప్లాట్ కొన్న యశస్వి జైస్వాల్

 రూ. 5 కోట్ల విలువైన ప్లాట్  కొన్న యశస్వి జైస్వాల్

టీమ్ ఇండియా యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ మరో ఇంటిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.  ముంబైలో దాదాపు రూ. 5 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం.  బాంద్రా ఈస్ట్‌లో ఉన్న టెన్ బికెసి ప్రాజెక్ట్‌లో 1,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఖరీదైన అపార్ట్‌మెంట్ కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతేడాది కూడా జైస్వాల్  5 BHK ప్లాట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  

22 ఏళ్ల జైస్వాల్ గతేడాది వెస్టిండీస్ తో USAలలో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.  టీమ్ ఇండియా తరఫున 7 టెస్టుల్లో 861,17 టీ20ల్లో 502 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2020 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసిన జైస్వాల్ ....  ఐపీఎల్ 2023లో ఐదవ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.  

2020 వేలంలో ఆ ఫ్రాంచైజీ ఈ యంగ్ ప్లేయర్​ను రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక 2022లోనూ రాజస్థాన్ జట్టు జైస్వాల్​ను రూ. 4 కోట్లకు సొంతం చేసుకుంది. యశస్వి జైస్వాల్ నికర విలువ రూ. 10.73 కోట్లు అని అంచనా. ఈ యంగ్ క్రికెటర్ ప్రతి నెలా దాదాపు రూ. 35 లక్షలు సంపాదిస్తున్నాడట.