
ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ అథ్లెట్ల హవా కొనసాగుతోంది.10 మీటర్ల ఎయిర్రైఫిల్ విభాగంలో టీమ్ఇండియా స్వర్ణ పతకం సాధించింది. రుద్రాంక్ష్ పాటిల్, దివ్యాన్ష్, తోమర్తో కూడిన బృందం ఫైనల్లో 1893.7 పాయింట్లను నమోదు చేసింది. దీంతో గతంలో చైనా చేసిన 1893.3 పాయింట్ల రికార్డును అధిగమించింది. ప్రస్తుతం టీమ్ఇండియా ఖాతాలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.
10 మీటర్ల ఎయిర్రైఫిల్ విభాగంలో జట్టుగా స్వర్ణం గెలిచిన రుద్రాంక్ష్, దివ్యాన్ష్, తోమర్ వ్యక్తిగతంగానూ ఫైనల్కు చేరుకోవడం విశేషం. ఫైనల్ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష్ మూడో స్థానం, తోమర్ ఐదోస్థానం, దివ్యాన్ష్ ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. మరోవైపు మెన్స్ ఫోర్ రోయింగ్ ఈవెంట్లోనూ భారత్ కాంస్య పతకం దక్కించుకుంది.