మాదాపూర్, వెలుగు: శాలరీ సరిపోక, గంజాయి అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన యాపుగంటి ఫణికిరణ్(27)కు 2016లో రాజమండ్రికి చెందిన నాగు అలియాస్నాగువర్మ పరిచయం అయ్యాడు. ఇతని ద్వారా ఫణికిరణ్ గంజాయి తాగడం అలవాటు చేసుకున్నాడు. తర్వాత ఫణికిరణ్హైదరాబాద్వచ్చాడు. మాదాపూర్వీకర్స్సెక్షన్కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ.. ఐటీ కారిడార్లోని ఓ సాఫ్ట్వేర్కంపెనీలో పనిచేస్తున్నాడు.
జీతం సరిపోకపోవడంతో గంజాయి అమ్మాలని డిసైడ్అయ్యాడు. నాగువర్మను కాంటాక్ట్అయి కేజీ గంజాయిని రూ.10 వేలకు కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు. చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చిస్నేహితులు, ఉద్యోగులకు అమ్ముతూ వస్తున్నాడు. సమాచారం అందుకున్న మాదాపూర్పోలీసులు ఫణికిరణ్ ఉంటున్న హాస్టల్గదిలో రైడ్ చేసి 1,643 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో గంజాయి అమ్ముతూ ఫణికిరణ్పట్టుబడినట్లు పోలీసులు గుర్తించారు. శనివారం నిందితుడిని అరెస్ట్చేశారు. నాగువర్మ పరారీలో ఉన్నాడు.