బెంగళూరు ఓయో రూమ్లో ఘోరం.. పాతికేళ్ల ఐటీ ఉద్యోగి.. 36 ఏళ్ల మహిళను రూంకు తీసుకెళ్లి..

బెంగళూరు ఓయో రూమ్లో ఘోరం.. పాతికేళ్ల ఐటీ ఉద్యోగి.. 36 ఏళ్ల మహిళను రూంకు తీసుకెళ్లి..

అతనికి 25.. ఆమెకు 36.. ఇద్దరి మధ్య 11 ఏళ్ల గ్యాప్. అయితేనేం.. పరిచయం కాస్త ఆకర్షణగా.. ప్రేమగా మారింది. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. ఈ పాతికేళ్ల ఐటీ ఉద్యోగి.. వయసులో పెద్దదైన తన ప్రేయసిని ఓయో రూమ్ కు తీసుకెళ్లాడు. అంతలోనే ఊహించని ఘోరం జరిగిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు ఓయో హోటల్ రూమ్ లో హరిణి హత్యకు గురైంది. శుక్రవారం (జూన్ 6) రాత్రి తన బాయ్ ఫ్రెండ్ యషాస్ తో కలిసి ఓయోకు వెళ్లింది. తెల్లవారే సిరికి శవమై తేలడం సంచలనంగా మారింది. పూర్ణ ప్రజ్ఞ లేయౌట్ లోని ఓయో రూమ్ లో కత్తిపోట్లకు గురై చనిపోయింది హరిణి.   ఇద్దరూ  కెంగేరీ ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం.

సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి సుబ్రహ్మణ్యపురం స్టేషన్ లో కేసు నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోంది. 

బెంగళూరు సౌత్ డీసీపీ, లోకేశ్ బి జగలాసర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘‘జూన్ 6, 7 మధ్య రాత్రి ఈ ఘటన జరిగింది. యషాస్ తో రిలేషన్ ను క్లోజ్ చేసుకుందామని హరిణి భావించింది. అతన్ని దూరం ఉంచాలని ప్రయత్నించింది. తీవ్ర ఆగ్రహం, అసూయతో కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు’’ అని డీసీపీ తెలిపారు. 

ఇద్దరు పిల్లల తల్లి.. కుటుంబ సభ్యులకు వ్యవహారం తెలియటంతో..

హరిణికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే యషాస్ తో ఆమె ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలిసి మందలించారు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తున్నాయని, దీంతో రిలేషన్ ను కట్ చేసుకుందామని యషాస్ తో చెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన యషాస్ కత్తితో 17 పోట్లు పొడిచాడని పోలీసులు తెలిపారు. 

అయితే ఓయో రూమ్ లో సడెన్ గా కత్తి ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఆమెను అంతం చేయాలని ముందే భావించి పథకం ప్రకారం కత్తి వెంట తెచ్చుకుని ఉంటాడని భావిస్తున్నారు. రిలేషన్ ఆపేద్దామని చెప్పిన తర్వాత కలిసి మాట్లాడాలని చెప్పి ఒప్పించి.. ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.