సెల్ ఫోన్ ఇవ్వలేదని బాలుడు సూసైడ్.. ఓల్డ్ సిటీ మహ్మద్ కాలనీలో ఘటన

సెల్ ఫోన్ ఇవ్వలేదని బాలుడు సూసైడ్.. ఓల్డ్ సిటీ మహ్మద్ కాలనీలో ఘటన

ఎల్బీనగర్, వెలుగు: తండ్రి మొబైల్ ఫోన్ ఇవ్వకపోవడంతో బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఓల్డ్ సిటీ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట మహమ్మద్ కాలనీకి చెందిన నిస్సార్ అహ్మద్ కు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు అయాన్ అహ్మద్(13) ఆరో తరగతి చదువుతున్నాడు. 

ఆదివారం రాత్రి భోజనం చేసే సమయంలో తన తండ్రి నిస్సార్ అహ్మద్ ను సెల్ ఫోన్ అడిగాడు. మొబైల్ ఇవ్వకపోవడంతో కోపంతో రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి స్థానిక హాస్పిటల్​కు తరలించగా అప్పటికే అయాన్ అహ్మద్ మృతిచెందాడు.