డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లికి నిప్పుపెట్టి చంపిన టీనేజర్

డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లికి నిప్పుపెట్టి  చంపిన టీనేజర్

ఉస్మానాబాద్ : డబ్బులు అడిగితే ఇవ్వలేదని కన్న తల్లినే చంపేశాడు 17 ఏళ్ల ఓ టీనేజర్. ఈ విషాదకర సంఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా టెర్ అనే టౌన్ లో చోటుచేసుకుంది. నిందితుడు జువైనల్ కావటంతో అతన్ని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్ కు తరలించారు. టీనేజర్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. “బుధవారం టీనేజర్ తన తల్లిని డబ్బులు కావాలని కోరాడు. డబ్బులు లేవని ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపం పెంచుకొని ఇంటి ఆవరణలో ఉన్న తల్లికి నిప్పు పెట్టాడు ” అని ఇన్స్ పెక్టర్ మెహన్ జాదవ్ చెప్పారు. మంటల్లో చిక్కుకొని కేకలు వేయటంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లు వెంటనే ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారని ఐతే ట్రీట్ మెంట్ పొందుతూ గురువారం చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. నిందితున్ని కోర్టులో హజరుపర్చిన తర్వాత జ్యూవైనల్ హోమ్ కు తరలించామని పోలీసులు చెప్పారు.