తీన్మార్ మల్లన్న అరెస్ట్

తీన్మార్ మల్లన్న అరెస్ట్

హైదరాబాద్: జర్నలిస్ట్​, క్యూ న్యూస్ అధినేత తీన్మార్​ మల్లన్న ( చింతపండు నవీన్)ను  హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. మల్లన్న తనను డబ్బుల కోసం బ్లాక్​ మెయిల్​ చేశాడని  జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్​శర్మ చేసిన  ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రూ.30 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసాడని, ఇవ్వకపోతే తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేసి పేరు చెడగొడతానని బెదిరించాడని లక్ష్మీకాంత్ శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు ఇప్పటికే తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు. శుక్రవారం రాత్రి ఉన్నట్టుండి మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా, సీతాఫల్​ మండిలోని మధురానగర్​లో మారుతీ జ్యోతిష్యాలయం అనే సంస్థను లక్ష్మీకాంత్ శర్మ నిర్వహిస్తున్నారు. ఈ జ్యోతిష్యాలయంపై ఇటీవల క్యూ న్యూస్‌లో​వరుస కథనాలు ప్రసారం చేశారని, ఆ తర్వాత డబ్బుల కోసం బెదిరింపులకు దిగాడని లక్ష్మీకాంత్ శర్మ ఆరోపించారు.