ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటి అయ్యారు. మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్కుమార్ తేజస్వీ యాదవ్కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ భేటిలో జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో అమలవుతున్నపథకాల గురించి ప్రధానంగా చర్చించినట్లుగా సమాచారం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఆర్జేడీ నుంచి మాజీ మంత్రి అబ్దుల్ భారీ సిద్దిఖీ జీ, ఎమ్మెల్సీ సునీల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్లు ఈ భేటిలో పాల్గొన్నారు.
For More News..
కేసీఆర్కు బుద్ధి చెప్పి.. గద్దె దింపాల్సిన సమయమొచ్చింది