కేసీఆర్‎ను కలిసిన బీహార్ ప్రతిపక్ష నాయకుడు

కేసీఆర్‎ను కలిసిన బీహార్ ప్రతిపక్ష నాయకుడు

ఆర్‌జేడీ నేత, బీహార్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్ ప్రగతి భవన్‎లో సీఎం కేసీఆర్‎తో భేటి అయ్యారు. మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌ తేజ‌స్వీ యాద‌వ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.  తేజ‌స్వీ యాద‌వ్ నేతృత్వంలోని పార్టీ ప్ర‌తినిధుల బృందం  సీఎం కేసీఆర్‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసింది. ఈ భేటిలో జాతీయ రాజ‌కీయాలు, రాష్ట్రంలో అమ‌ల‌వుతున్నప‌థ‌కాల గురించి ప్ర‌ధానంగా చ‌ర్చించిన‌ట్లుగా స‌మాచారం. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఆర్‌జేడీ నుంచి మాజీ మంత్రి అబ్దుల్ భారీ సిద్దిఖీ జీ, ఎమ్మెల్సీ సునీల్ సింగ్‌, మాజీ ఎమ్మెల్యే భోలా యాద‌వ్‎లు ఈ భేటిలో  పాల్గొన్నారు.

For More News..

కేసీఆర్‎కు బుద్ధి చెప్పి.. గద్దె దింపాల్సిన సమయమొచ్చింది

మేడారానికి స్పెషల్ బస్సులు.. ధర ఎంతంటే? 

ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు వాయిదా