- మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్గా వివేక్ వెంకటస్వామి
- పబ్లిక్ మీటింగ్స్ కమిటీ చైర్మన్ గా బండి సంజయ్
- పోరాటాల కమిటీ చైర్పర్సన్గా విజయశాంతి
- స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- చార్జ్షీట్, సోషల్ మీడియా, మీడియా తదితర కమిటీల నియామకం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ ఎలక్షన్ స్పీడ్ను పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతస్థాయిలో ప్రచారం చేసేందుకు, పార్టీ విధానాలను జనంలోకి తీసుకు వెళ్లేందుకు వీలుగా ఆ పార్టీ హైకమాండ్ గురువారం ఏకంగా 14 కమిటీలను నియమించింది. ఒక్కో కమిటీకి చైర్మన్ ను, కన్వీనర్ ను నియమించింది. కొన్ని కమిటీలకు జాయింట్ కన్వీనర్లను కూడా ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతితో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ కమిటీలను ప్రకటించారు. ఇందులో మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీకి చైర్మన్గా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని హైకమాండ్ నియమించింది. పబ్లిక్ మీటింగ్స్ కమిటీ చైర్మన్గా ఎంపీ బండి సంజయ్కు, సోషల్ మీడియా కమిటీ చైర్మన్గా ఎంపీ ధర్మపురి అర్వింద్కు, మీడియా కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే రఘునందన్రావుకు, పోరాటాల కమిటీ చైర్పర్సన్గా మాజీ ఎంపీ విజయశాంతికి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.
ఇవీ 14 కమిటీలు :
మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ:
చైర్మన్: మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి,
కన్వీనర్: మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి,
జాయింట్ కన్వీనర్: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
సోషల్ ఔట్ రీచ్ కమిటీ:
చైర్మన్: ఎంపీ లక్ష్మణ్ ,
కన్వీనర్: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ .
పబ్లిక్ మీటింగ్స్ కమిటీ:
చైర్మన్: ఎంపీ బండి సంజయ్, కన్వీనర్: ప్రేమేందర్ రెడ్డి,
జాయింట్ కన్వీనర్: కాసం వెంకటేశ్వర్లు.
ఇన్ఫ్ల్యూయెన్సర్ ఔట్ రీచ్ కమిటీ:
చైర్పర్సన్: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ,
కన్వీనర్: మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి.
చార్జ్షీట్ కమిటీ:
చైర్మన్: బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధర్ రావు,
కన్వీనర్: మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ,
జాయింట్ కన్వీనర్లు: మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రామచంద్రుడు.
స్క్రీనింగ్ కమిటీ:
చైర్మన్: మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,
కన్వీనర్: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్.
పోరాటాల కమిటీ:
చైర్పర్సన్: మాజీ ఎంపీ విజయశాంతి,
కన్వీనర్: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి.
సోషల్ మీడియా కమిటీ:
చైర్మన్: ఎంపీ ధర్మపురి అర్వింద్,
కన్వీనర్: పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి.
ఎలక్షన్ కమిషన్ ఇష్యూల కమిటీ:
చైర్మన్: మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి,
కన్వీనర్: మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్.
హెడ్ క్వార్టర్స్ కో ఆర్డినేషన్ కమిటీ:
చైర్మన్: మాజీ ఎమ్మెల్యే ఎన్.ఇంద్రసేనా రెడ్డి,
కన్వీనర్: బంగారు శృతి.
మీడియా కమిటీ:
చైర్మన్: ఎమ్మెల్యే రఘునందన్ రావు,
కన్వీనర్: మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు,
జాయింట్ కన్వీనర్: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి.
క్యాంపెయిన్ ఇష్యూస్, టాకింగ్ పాయింట్స్ కమిటీ:
చైర్మన్ : వెదిరె శ్రీరాం, కన్వీనర్ : మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ .
ఎస్సీ నియోజకవర్గాల కో ఆర్డినేషన్ కమిటీ:
చైర్మన్: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి,
కన్వీనర్ : మాజీ మంత్రి విజయరామారావు.
ఎస్టీ నియోజకవర్గాల కో ఆర్డినేషన్ కమిటీ:
చైర్మన్ : మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, కన్వీనర్: ఎంపీ సోయం బాపూరావు, జాయింట్ కన్వీనర్ : మాజీ మంత్రి రవీంద్ర నాయక్.