కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నరు

 కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నరు

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం నిత్యం అబద్దాలు చెబుతూ రైతులను మోసం చేశారని ఆరోపించారు. రైతు బంధు ఇచ్చి అన్ని సబ్సిడీలను రద్దు చేశారన్నారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను తెరవలేదన్నారు. ఇప్పటికే 70 శాతం మంది తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకున్నారని తెలిపారు. తరుగు, తేమతో క్వింటాల్ కు ఆరు కిలోల చొప్పున తీసివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర కోసం మిర్చి రైతులు ఆందోళన చేస్తే వారికి సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లారని మండిపడ్డారు. కేసీఆర్ రైతు ద్రోహి అని..అధికారాన్ని కాపాడుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలంగాణలో దుర్వియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 

మరిన్ని వార్తల కోసం

బుర్జ్ ఖలీఫా’పై ‘విక్రమ్’ ట్రైలర్

కేసీఆర్ పాలనలో రాష్ట్రం ముందడుగు