
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్కనుసన్నల్లోనే ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ డబ్బులను ప్రభుత్వం దోచుకుందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్రావు అన్నారు. పీఎఫ్ డిపాజిట్ చేయనందున సర్కారుపై కార్మికులు కేసు పెట్టాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆర్టీసీకి ఫుల్టైం ఎండీ లేకపోవడం వల్లే రూ. 1000 కోట్ల పీఎఫ్డబ్బులు దారి మళ్లాయన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే నలుగురు ఆర్టీసీ కార్మికులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెలో ఉన్న కార్మికులకు వైద్య సేవలు నిలిపేయడం సరికాదన్నారు. సీఎం ఎత్తులు జిత్తులకు టీజీవో, టీఎన్జీవో చిక్కవద్దన్నారు.