9 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్ : అభ్యర్థులు వీరే, నియోజకవర్గాలు ఇవే

9 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్ : అభ్యర్థులు వీరే, నియోజకవర్గాలు ఇవే

రాబోయే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి దేశ వ్యాప్తంగా అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది బీజేపీ హైకమాండ్. 195 మంది అభ్యర్థులతో.. 18 రాష్ట్రాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ హైకమాండ్. తెలంగాణలో నియోజకవర్గాలు, అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

  • సికింద్రాబాద్ : కిషన్ రెడ్డి
  • కరీంనగర్ : బండి సంజయ్
  • నిజామాబాద్ : ధర్మపురి అరవింద్
  • జహీరాబాద్ : బీబీ పాటిల్
  • మల్కాజిగిరి : ఈటెల రాజేందర్
  • హైదరాబాద్ : డాక్టర్ మాధవీ లత
  • చేవెళ్ల : కొండా విశ్వేశ్వరరెడ్డి
  • నాగర్ కర్నూలు (ఎస్సీ) :  పి. భరత్
  • భువనగిరి : బూర నర్సయ్య గౌడ్

ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్వయం బాబూరావుకు ఫస్ట్ లిస్టులో చోటు దక్కలేదు. మిగతా ముగ్గురు ఎంపీలకు సీట్లను కన్ఫామ్ చేసింది బీజేపీ హైమాండ్.

ఇంకా ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆదిలాబాద్, మెదక్, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, వరంగల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను తర్వాత ప్రకటించనుంది బీజేపీ హైకమాండ్.