న్యూఢిల్లీ: గోల్డ్ మెడల్ ఆశలు రేపిన తెలంగాణ స్టార్ బాక్సర్ హుసాముద్దీన్ తుది మెట్టుపై బోల్తాపడ్డాడు. ఫిన్ లాండ్ లో జరుగుతున్న గీబీ బాక్సింగ్ టోర్నమెంట్ లో 56 కిలోల విభాగం ఫైనల్ లో ఇండియాకు చెందిన మరో బాక్సర్ కవీందర్ సింగ్ బిస్త్ తో తలపడి ఓడిపోయిన హుసాముద్దీన్ సి ల్వర్ మెడల్ తో సరిపెట్టుకున్నా డు. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుకు చెందిన ఈ ఇద్ద రు బా క్సర్లు నువ్వా నేనా అన్నట్టు తలపడిన చివరికి బిస్త్ గోల్డ్ మెడల్ దక్కించుకున్నా డు. ఓవరాల్ గా ఓ గోల్డ్ , నాలుగు సిల్వర్ , మూడు బ్రాంజ్ మెడల్స్ తో ఇండియా బా క్సర్లు ఈ టోర్నీ లో పతకాల పంట పండించారు. హుసాముద్దీన్ తో పాటు మూడు సార్లు ఏషి యన్ మెడల్ విజేత శివ థాప (60 కిలోలు), రూకీ గోవిం ద్ సహాని(49 కిలోలు), దినేశ్ డాగర్ (69కిలోలు) తమతమ విభాగాల్లో రజత పతకాలు సాధించారు.
49 కిలోల విభాగం ఫైనల్ లో రూకీ గోవింద్ సహాని 2–3తో థిటిసన్ పన్ మోద్ (థాయ్ లాండ్ ) చేతిలో ఓడిపోయాడు. 60కిలోల విభాగం ఫైనల్ లో శివ థాప 1–4తో ఆర్ స్లన్ ఖాతేవ్ (ఫిన్ లాండ్ ) చేతిలో ఓడిపోయాడు. దినేశ్ డాగర్ 69 కిలోల విభాగం ఫైనల్ లో మెక్ కొర్మా క్ చేతిలో ఓడిపోయాడు. కాగా , తమతమ విభాగాల్లో జరిగిన సె మీఫైనల్ బౌట్స్ లో ఓడిపోయిన సుమీత్ సగ్వాన్ (91 కిలోలు), సచిన్ సి వాచ్ (52 కిలోలు), నవీన్ కుమార్ (91 ప్లస్ కిలోలు) క ాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.