ఇరిగేషన్ కు రూ.28 వేల కోట్లు : కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులపై విచారణ

ఇరిగేషన్ కు రూ.28 వేల కోట్లు : కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులపై విచారణ

నీటి పారుదల శాఖపై ప్రత్యేక దృష్టి కేటాయించామని.. నీటి పారుదల రంగం నిపుణులతో చర్చించి.. ప్రాధాన్యత ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేయటం జరుగుతుందన్నారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో ఇరిగేషన్ వ్యవస్థ నాశనం అయ్యిందని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన అన్ని ప్రాజెక్టులపై విచారణ చేపడతాం అని బడ్జెట్ సమావేశాల్లో స్పష్టం చేశారు మంత్రి భట్టి విక్రమార్క.

తక్కువ ఖర్చుతో.. త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి.. వాటిని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. Amr శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్, మహాత్మ గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, జవహర్ నెట్టం పాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, SRSP ఇందిరమ్మ వరద నీటి కాల్వ, జె చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్, కోమురం భీం, చిన్న కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు ఉన్నాయని.. వాటిని త్వరగా పూర్తి చేసి.. భూములకు నీళ్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 

నీటి పారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ఈ బడ్జెట్ లో 28 వేల 024 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారాయన.