మార్చ్ 20న రాష్ట్ర కేబినెట్ భేటీ

మార్చ్  20న రాష్ట్ర కేబినెట్ భేటీ
  •     బడ్జెట్​కు ఆమోదం తెలుపనున్న మంత్రివర్గం 

హైదరాబాద్, వెలుగు : ఈ నెల 20వ తేదీన రాష్ట్ర కేబినెట్​భేటీ కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్​లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 9.30 గంటలకు మీటింగ్ జరగనుందని సీఎస్ ​రామకృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్​ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు దానికి మంత్రివర్గ ఆమోదం తీసుకుంటారు. అంతేగాక, ఈసారి బడ్జెట్​ఎంత పెరుగుతుందనే దానిపైనా కూడా చర్చ జరుగుతోంది. 

ఈసారి పెద్దగా కొత్త స్కీములేవి పెట్టడం లేదని తెలుస్తోంది. ఉన్న స్కీములకే కేటాయింపులు పెంచనున్నట్లు సమాచారం. రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్​ రూ.3.20 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలిసింది.