![త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం పనులు ప్రారంభం](https://static.v6velugu.com/uploads/2024/02/telangana-cm-and-ministers-meet-with-central-minister-nitin-gadkari_2ahQZMCcqP.jpg)
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపుతో సహా పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ – శ్రీశైలం ఫోర్ లైన్ ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్– కల్వకుర్తి రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయడం, రీజినల్ రింగ్ రోడ్డు (RRR) దక్షిణ భాగం అభివృద్ధి పనులు, హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిని ఆరువరుసల విస్తరించడంపై గడ్కరీతో చర్చించారు. అంతేకాకుండా సీఆర్ఐఎఫ్ నిధులను పెంచాలని కోరారు.
నల్గొండలో ట్రాన్స్ పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని, నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీని ప్రత్యేకంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. మంత్రి విజ్ఞప్తి పట్ల గడ్కరీ సానుకూలంగా స్పందించారు.