ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్, మంత్రులు

ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్, మంత్రులు

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికలకు కాంగ్రెస్​ హైకమాండ్​ సిద్ధమవుతున్నది. అన్ని రాష్ట్రాల లోక్​సభ కోఆర్డినేటర్లతో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సహా లోక్​సభ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, ఏఐసీసీ ఇన్​చార్జులు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు.

లోక్​సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకులకు పార్టీ హైకమాండ్​ దిశానిర్దేశం చేయనుంది. లోక్​సభ ఎన్నికలపై చర్చించిన అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్​ పదవుల భర్తీపైనా అధిష్ఠానంతో పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.