హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమవుతున్నది. అన్ని రాష్ట్రాల లోక్సభ కోఆర్డినేటర్లతో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సహా లోక్సభ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, ఏఐసీసీ ఇన్చార్జులు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు.
లోక్సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకులకు పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. లోక్సభ ఎన్నికలపై చర్చించిన అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపైనా అధిష్ఠానంతో పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.