భారత్ ​జోడో న్యాయ్ యాత్రకు సీఎం , డిప్యూటీ సీఎం

భారత్ ​జోడో  న్యాయ్ యాత్రకు సీఎం , డిప్యూటీ సీఎం

హైదరాబాద్, వెలుగు: రాహుల్​గాంధీ తలపెట్టిన భారత్ ​జోడో ‘న్యాయ్’​యాత్రకు రాష్ట్రం నుంచి కీలక నేతలు హాజరు కానున్నారు. సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్​రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి, పీసీసీ వర్కింగ్ ​ప్రెసిడెంట్ మహేశ్​కుమార్​ గౌడ్ న్యాయ్ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.

ఇప్పటికే ఆయా నేతలంతా ఢిల్లీకి వెళ్లారు. అక్కడి నుంచి ఆదివారం ఉదయం మణిపూర్​కు వెళ్లనున్నారు. సీఎం రేవంత్​రెడ్డి ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో మణిపూర్​కు చేరుకుంటారు. రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలూ వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ​షర్మిల కూడా న్యాయ్​యాత్రలో పాల్గొననున్నారు. 

భారత్​జోడో యాత్రకు కొనసాగింపుగా రెండో విడతలో ‘న్యాయ్’​యాత్ర పేరుతో రాహుల్ పాదయాత్రను చేయనున్నారు. అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ ​నుంచే రెండో విడత యాత్రను ప్రారంభించాలని డిసైడ్​అయ్యారు. ఆదివారం ఇంఫాల్ ​నుంచి మొదలుపెట్టి మహారాష్ట్ర రాజధాని ముంబైతో యాత్రను ముగించనున్నారు. రాహుల్ 6,700 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర, బస్సు యాత్రలు చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.