తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ని ఆపవద్దంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాను బయలుదేరడానికి చాలా సేపటి ముందు నుంచే ట్రాఫిక్ నిలిపివేయొద్దని పోలీసులకు సూచించారు. దీనివల్ల వాహనాదారులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఈ విషయంలో మినహాయింపులు కల్పించే ఆలోచన చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.
ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్ వెళ్లేలా చూడాలన్నారు. సాధారణ ట్రాఫిక్లోని తన కాన్వాయ్ని అనుమతించాలని సీఎం ఆదేశించారు. ఇక కాన్వాయ్ కోసం కొత్త కార్లను కొనద్దని, ప్రస్తుతం ఉన్న తెల్లరంగు కార్లకు నలుపు రంగు వేసి వినియోగించాలని ఆదేశించారు. ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసులు సీఎం సూచనలపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు.