- టీజీసీఎస్పీ ఎస్పీ హర్షవర్ధన్
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు : సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్ధన్ సూచించారు. సోమవారం గీతం యూనివర్సిటీ, టీజీసీఎస్బీ సహకారంతో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో సెమినార్నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్తో కలిసి హర్షవర్ధన్ హాజరై సైబర్ ఫ్రాడ్స్ విషయాలపై మాట్లాడారు. రోజురోజుకూ సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. మొబైల్స్ ద్వారా సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసి బ్లాక్మెయిల్, దోపిడీ, డేటా దర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఆన్లైన్ గేమింగ్, చాటింగ్ లాంటి విషయాల్లో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఓటీపీ, డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసం, ఏపీకే ఫైల్ ట్రాప్స్, నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లాంటి ఫ్లాట్పామ్స్లో ఆన్లైన్ మోసాలు జరుగుతున్నామయని వివరించారు.
సైబర్నేరానికి గురైనవారు వెంటనే సైబర్ క్రైమ్, హెల్ప్లైన్ నంబర్ 1930కి సమాచారం అందిస్తే ఫలితం ఉంటుందన్నారు. అనంతరం అందరితో సైబర్ సేఫ్టీ ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో స్కూల్ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, కోర్ ఇంజినీరింగ్ డీన్ ప్రొఫెసర్వీఆర్ శాస్ర్తి, ప్రొఫెసర్ త్రినాథరావు, నోడల్ ఆఫీసర్ కేవీ సూర్యప్రకాశ్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, పటాన్చెరు ఎస్హెచ్వో వినాయక్ రెడ్డి, సీఐలు రవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
