జులై 15 వరకు టీచర్ల సర్దుబాటు విద్యాశాఖ ఉత్తర్వులు

జులై 15 వరకు టీచర్ల సర్దుబాటు విద్యాశాఖ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్ ప్లస్ టీచర్లను అవసరమైన స్కూళ్లకు సర్దుబాటు చేసే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. టీచర్ల సర్దుబాటు ప్రక్రియను వచ్చేనెల 15 వరకు పూర్తి చేయాలని ఆదేశించింది.  ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి డీఈఓలకు ఆదేశాలు జారీచేశారు. ఈనెల 13 నాటికి సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులిచ్చిన ఆదేశాలపై టీచర్ల సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

బడులు తెరిచిన రోజే విద్యార్థుల సంఖ్యను ఎలా గుర్తిస్తామని ప్రశ్నించాయి. దీంతో స్పందించిన విద్యాశాఖ అధికారులు సవరణ ఉత్తర్వులు జారీచేశారు. సర్దుబాటు మార్గదర్శకాలకు అనుగు ణంగా టీచర్లను నియమించాలని ఆదేశించారు. సర్దుబాటు చేసిన టీచర్ల వివరాలను జులై 22 వరకు  స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్​కు పంపించాలని సూచించారు.