విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 1 నుంచి 9 తరగతుల స్టూడెంట్స్ ప్రమోట్

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 1 నుంచి 9 తరగతుల స్టూడెంట్స్ ప్రమోట్
  • విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ మంత్రి
  • వేసవి సెలవులు కూడా నిర్ధారణ
  • ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలిడేస్


రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే టెన్త్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను ప్రమోట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా 1 నుంచి 9 తరగతుల విద్యార్థులను కూడా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా.. ఈ ఏడాది వేసవి సెలవులను కూడా ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే 31వరకు వేలవి సెలవులుగా పరిగణిస్తూ ప్రభుత్వం ప్రకటించింది.

‘ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు. కరోనా విస్తరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53,79,388 మంది విద్యార్థులను కూడా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేది కోవిడ్ - 19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న  ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పనిదినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.