తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై సర్కార్ బడుల్లో నర్సరీ, LKG, UKG తరగతులు

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై సర్కార్ బడుల్లో నర్సరీ, LKG, UKG తరగతులు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూళ్లకే పరిమితమైన ప్రీ ప్రైమరీ తరగతులను సర్కారు బడుల్లో ప్రవేశపెట్టాని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం (జూన్ 11) ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర శిక్షణలో భాగంగా రాష్ట్రంలోని 210 ప్రభుత్వ స్కూళ్లలో నర్సరీ, ఎల్‎కేజీ, యూకేజీ తరగతుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, ఎల్‎కేజీ, యూకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‎కేజీ, యూకేజీ వంటి ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులో  లేకపోవడంతో తల్లిదండ్రులు ఇంకో ఆప్షన్ లేక పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారు. 

ALSO READ | అంగన్ వాడీ కేంద్రాలు ఓపెన్.. పిల్లలకు ఫస్ట్ డేనే ఎగ్ బిర్యానీ

ఇదే అదునుగా భావిస్తోన్న కొన్ని ప్రైవేట్ స్కూల్స్.. నర్సరీ, ఎల్‎కేజీ, యూకేజీ తరగతులకు కూడా ముక్కుపిండి వేలల్లో ఫీజులు వసూల్ చేస్తున్నాయి. ఈ ఫీజుల భారం భరించలేక చాలా మంది పేరెంట్స్ పిల్లలను ప్రీ ప్రైమరీ స్కూలింగ్‎కు దూరంగా ఉంచి.. నేరుగా ఒకటవ తరగతిలోనే జాయిన్ చేస్తున్నారు. ఇలాంటి వారందరికి ప్రభుత్వ తాజా భారీగా ఉపశమనంగా కల్పిస్తోంది. విద్యా శాఖ నిర్ణయంతో పేద, మధ్య తరగతి తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గనుంది.