తెలంగాణ విద్యార్థులకు హై అలర్ట్.. జులై 20,21న విద్యాసంస్థలకు సెలవులు..

తెలంగాణ విద్యార్థులకు హై అలర్ట్..  జులై 20,21న విద్యాసంస్థలకు సెలవులు..

రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. జులై 20, 21న అన్ని విద్యా సంస్థలు బంద్​ అని స్పష్టం చేశారు. 

విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా సీఎం కేసీఆర్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సబితా పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థలు ప్రత్యేక తరగతులు తదితర కారణాల పేరుతో కాలేజీలు, బడులను నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ఆమె ట్వీట్​ కూడా చేశారు.