417 మంది  తహసీల్దార్ల బదిలీ

417 మంది  తహసీల్దార్ల బదిలీ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పెద్ద ఎత్తున తహసీల్దార్లను రాష్ట్ర సర్కార్​ ట్రాన్స్​ఫర్​ చేసింది. రెండు మల్టీజోన్ల పరిధిలో 417 మందిని బదిలీ చేస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్​సెక్రటరీ నవీన్​ మిట్టల్​మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బదిలీలు చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్రంలో మూడేండ్లకుపైగా  ఒకే దగ్గర పనిచేస్తున్న తహసీల్దార్లను ప్రభుత్వం ట్రాన్స్​ఫర్ చేసింది.