
హైదరాబాద్, వెలుగు: కవి,రచయిత జూకంటి జగన్నాథానికి రాష్ట్ర ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య అవార్డును ప్రకటించింది. దాశరథి కృష్ణమాచార్య జయంతిని పురస్కరించుకొని సర్కారు ఏటా ఈ అవా ర్డును అందజేస్తుండగా.. ఈసారి జ్యూరీ కమిటీ జగన్నాథాన్ని ఎంపిక చేసింది. ఈ మేరకు యువజన, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
దాశరథి జయంతి సందర్భంగా సోమవారం జగన్నాథానికి అవార్డుతో పాటు రూ.1,01,116 నగదు అందచేయ నున్నారు. సిరిసిల్లకు చెందిన జూకంటి 1993లో పాతళగరిగె నుంచి 2020లో సద్దిముల్లె వరకు సుమారు 16 కవిత సంక లనాలు రచించారు. వీటిలో కథా సంపు టీలు వెలువరించారు. తన సాహితీ సేవకు గాను సినారె కవితా పురస్కారం, తెలంగా ణ ఉత్తమ సాహితీవేత్త పురస్కారం సహా ఇప్పటి వరకు మొత్తం 11 అవార్డులు అం దుకున్నారు. 2007 నుంచి 2013 వరకు తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా పనిచేసిన జూకంటి.. తెలంగాణ ఉద్యమం లో చురుగ్గా పాల్గొన్నారు.