గాంధీ హాస్పిటల్ కు రూ.66 కోట్లు మంజూరు

గాంధీ హాస్పిటల్ కు రూ.66 కోట్లు మంజూరు

పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్​అభివృద్దికి, సమస్యల పరిష్కారానికి, మెడికల్ కాలేజీ స్టూడెంట్ల​హాస్టల్​ బిల్డింగ్ నిర్మాణానికి రూ.66 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, హెల్త్​మినిస్టర్​దామోదర రాజనర్సింహకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజారావు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం టీజీఎంఎస్ఐడీసీ ఎండీగా చార్జ్​తీసుకున్న ఐఏఎస్ ఆఫీసర్​హేమంత్​ను కలిసిన సూపరింటెండెంట్​అభినందనలు తెలిపారు. 

గాంధీలో డ్రైనేజీ పనులకు రూ 15.5 కోట్లు, ఎలక్ట్రికల్​ పనులకు రూ రూ.12 కోట్లు, ఫైర్​ఫైటింగ్ సిస్టమ్ వర్క్స్​కు రూ3.5 కోట్లు, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్​ ఫ్లాంటేషన్​ సెంటర్ పనులకు రూ.35 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ పనులన్నీ టీజీఎంఎస్​ఐడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. త్వరితగతిన పూర్తిచేయాలని తాము చేసిన విజ్ఞప్తికి టీజీఎంఎస్​ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్​ హేమంత్​ సానుకూలంగా స్పందించారని రాజారావు వివరించారు.