
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్మించబోయే 20 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రభుత్వం రూ.4 వేల కోట్ల నిధులను సాంక్షన్ చేసింది. ఈ మేరకు విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా ఉత్తర్వులు రిలీజ్ చేశారు. 20 నియోజకవర్గాల్లో నిర్మించే ఈ స్కూళ్లకు ఒక్కో దానికి రూ.200 కోట్ల చొప్పున మంజూరు చేశారు.