హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కీలక అప్డేట్..

హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కీలక అప్డేట్..

హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రాజెక్టు ప్రతిపాదనతో పాటు అవసమైన అన్ని పాత్రలను, డీపీఆర్ లను శనివారం ( జూన్ 21 ) కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. వరం క్రితమే రెండో దశ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులను ఇచింది తెలంగాణ సర్కార్. 86.1 కిలోమీటర్లతో మెట్రో రెండో దశ ప్రాజెక్టును ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం. రూ.19 వేల 579 కోట్లతో మెట్రో రెండో దశ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో మెట్రో రెండో దశ నిర్మాణం చేపట్టనున్నాయి.

మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు గాను 3 కారిడార్లకు రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది.ఈ కారిడార్లలో ఆర్‌జిఐఎ నుండి భారత్ ఫ్యూచర్ సిటీ (39.6 కిమీ; రూ. 7,168 కోట్లు), జెబిఎస్ నుండి మేడ్చల్ (24.5 కిమీ; రూ. 6,946 కోట్లు), జెబిఎస్ నుండి షామిర్‌పేట (22 కిమీ; రూ. 5,465 కోట్లు). కారిడార్లు ఉన్నాయి. మొత్తం 86.1 కిమీ పొడవును కవర్ చేసే ఈ ఫేజ్ 2 (బి) ప్రాజెక్టులో మొత్తం రూ. 19,579 కోట్ల వ్యయం కానున్నట్లు తెలుస్తోంది.

గతంలో సమర్పించిన ప్లీజ్ 2 (ఎ) ప్రాజెక్ట్ ఐదు కారిడార్ల (76.4 కి.మీ) లాగానే, ఈ ఫేజ్ 2 (బి) ప్రాజెక్ట్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం GoI, తెలంగాణ ప్రభుత్వం GoTG ల జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.కేంద్ర ప్రభుత్వ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారం, ఫేజ్ 2 (బి) ఖర్చు రూ. 19,579 కోట్లుగా తెలుస్తోంది. ఇందులో తెలంగాణ ప్రభుత్వ వాటా రూ. 5,874 కోట్లు (30 శాతం ) కాగా.. కేంద్ర ప్రభుత్వ  GoI వాటా రూ. 3,524 కోట్లు (18 శాతం ). అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి రుణం రూ. 9,398 కోట్లు (48%) , చిన్న PPP భాగం రూ. 783 కోట్లు (4%) కలిగి ఉంటుంది.