ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ సెంటర్

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ సెంటర్
  • ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏర్పాటు

న్యూ ఢిల్లీ, వెలుగు: ఇరాన్–ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో హెల్ప్ లైన్  సెంటర్ ను ఏర్పాటు చేసింది. 2 దేశాల్లో నివసిస్తున్న, ప్రయాణిస్తున్న తెలంగాణవాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన ఎవరు ప్రభావితమైనట్టు తమకు సమాచారం అందలేదని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.  

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. ఆయా దేశాల్లో తెలంగాణ ప్రజల సహాయం కోసం ఆర్సీ పీఎస్ వందన (+91 9871999044), లైజన్ ఆఫీసర్లు రక్షిత్  (+91 9643723157), జావేద్ హుస్సేన్ (+91 9910014749), పీఆర్వో చక్రవర్తి (+91 9949351270) లను సంప్రదించాలని భవన్ అధికారులు తెలిపారు.