గవర్నర్ తమిళిసై ఇంట్లో విషాదం..ప్రముఖుల సంతాపం

గవర్నర్ తమిళిసై ఇంట్లో విషాదం..ప్రముఖుల సంతాపం

తెలంగాణ గవర్నర్  తమిళిసై సౌందరరాజన్  తల్లి కృష్ణకుమారి  కన్నుమూశారు. నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణకుమారిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.

గవర్నర్  తమిళిసై తల్లి మృతి పట్ల సీఎం కేసీఆర్  సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్  సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమ కోహ్లీ, మంత్రి కేటీఆర్ రాజ్ భవన్ కు వెళ్లి కృష్ణకుమారి పార్థివదేహానికి నివాళులర్పించారు. గవర్నర్ ను పారామర్శించి సానుభూతి తెలిపారు. ఇవాళ సాయంత్రం గవర్నర్ సొంత ఊరు సాలిగ్రామానికి కృష్ణకుమారి పార్థివదేహాన్ని తీసుకెళ్లనున్నరు. రేపు చెన్నైలో కృష్ణకుమారి అంత్యక్రియలు జరగనున్నాయి.