తెలంగాణలో 5 ఎకరాల వరకురైతు భరోసా నిధులు జమ ..

తెలంగాణలో 5 ఎకరాల వరకురైతు భరోసా నిధులు జమ ..
  • 4.43 లక్షల మంది రైతులకు రూ.1,189.43 కోట్లు చెల్లింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది. గురువారం 4,43,167 మంది రైతుల ఖాతాల్లో రూ.1,189.43 కోట్ల నిధులు జమ చేసింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 62.47 లక్షల మంది రైతులకు రూ.6,404.69 కోట్లు అందించింది. మొత్తం కోటి 6 లక్షల ఎకరాలకు పంట పెట్టుబడి సాయం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాకు చెందిన 4.75 లక్షల మంది రైతులకు రూ.516.63 కోట్లు పెట్టుబడి సాయం కింద అందించింది.

 నాగర్ కర్నూల్ జిల్లాలోని 2.71 లక్షల మంది రైతులకు రూ.309.02 కోట్లు జమ చేసింది. తర్వాత ఖమ్మం జిల్లాలోని 3.07 లక్షల మంది రైతులకు రూ.301.47 కోట్లు అందించింది. సంగారెడ్డి జిల్లాలో 3.13 లక్షల మంది రైతుల బ్యాంకు అకౌంట్‌‌‌‌లో  రూ.298.75 కోట్లు జమ చేసింది.