ఆధార్ అప్‌‌డేట్‌‌ చేయకుంటే..అక్టోబర్ శాలరీ కట్..వెబ్ పోర్టల్‌‌లో ఉద్యోగులు వివరాలు నమోదు చేయాల్సిందే: ఆర్థిక శాఖ

ఆధార్ అప్‌‌డేట్‌‌ చేయకుంటే..అక్టోబర్ శాలరీ కట్..వెబ్ పోర్టల్‌‌లో ఉద్యోగులు వివరాలు నమోదు చేయాల్సిందే: ఆర్థిక శాఖ

హైదరాబాద్, వెలుగు: ఆర్థిక శాఖ  ఐఎఫ్ఎంఐఎస్​ పోర్టల్‌‌లో ఆధార్ వివరాలను అప్‌‌డేట్ చేయని  ఉద్యోగులు, తాత్కాలిక సిబ్బందికి అక్టోబర్​ నెల జీతాన్ని నిలివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఆయా శాఖల హెచ్ వోడీలకు సైతం శాలరీలు ఆపేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సర్య్కులర్​ మెమో ఇచ్చింది.

 అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు ఈ నెల 25 శనివారం అర్ధరాత్రిలోగా అందరి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని  స్పష్టం చేసింది. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌‌సోర్సింగ్‌‌లాంటి ఏ కేటగిరీ ఉద్యోగికి అయినా ఆధార్ వివరాలు ఐఎఫ్​ఐఎంఎస్​ పోర్టల్​ లో సమర్పించకపోతే జీతం చెల్లించబోమని స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ దగ్గర ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో రెగ్యులర్​ ఉద్యోగులు 5.21 లక్షలు, టెంపరరీ ఉద్యోగులు 4.93 లక్షల మంది ఉన్నారు.

అయితే గతంలోనే ఆన్​లైన్​ ఆధార్​ వివరాలు అప్​లోడ్​ చేయాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 16 వరకు వివరాలు చూస్తే ఇందులో 2.75 లక్షల మంది వివరాలు అప్‌‌డేట్​ అయ్యాయి. రెగ్యులర్​ ఉద్యోగులకు సంబంధించి అలాగే ఉన్నది.

దీంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర సర్కారు ఈ నెల 25లోగా ఉద్యోగులందరి ఆధార్​ వివరాలు అప్​డేట్​ చేయాలని ఆదేశించింది. అందుకు సమయాన్ని పొడిగిస్తూ అవకాశం కల్పించింది. అయినప్పటికీ ఇంకా చాలా శాఖలు ఆధార్​ అప్​డేట్​ చేయలేదు. శనివారం రాత్రి నాటికి టెంపరరీ ఉద్యోగులకు సంబంధించి 3.75 లక్షల మంది ఆధార్​ వివరాలు నమోదు చేసినట్లు తెలిసింది.