గద్వాల, వెలుగు : తెలంగాణ ప్రభుత్వం 2026–-27 విద్యాసంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు వివిధ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గలవారు డిసెంబర్ 11 నుంచి జనవరి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
