హైదరాబాద్, వెలుగు: రేషన్ కార్డులు 87.59 లక్షల మందికి ఉంటే ఇప్పటి వరకూ 50 లక్షల మందికి ఉచితంగా బియ్యం ఇచ్చినట్లు సీఎస్ తన నివేదిక లో పేర్కొనడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మిగిలిన 38 లక్షల మంది మాటేమిటని ప్రశ్నించింది. రేషన్ పై ఇటీవల దాఖలైన పిటిషన్ ను హైకోర్టు బుధవారం విచారించిం ది. ప్రభుత్వం తరఫున చీఫ్సెక్రటరీ ఇచ్చిన కౌంటర్ కు హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. లాక్డౌన్ ఉంటే వారంతా ఎలా జీవనాన్ని సాగించాలని చీఫ్ జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్ , జస్టి స్ అమర్ నాథ్ గౌడ్ బెంచ్ ప్రశ్నించింది. రూ. 5కే అన్నం పెడుతున్నా మని చెప్పడాన్ని కూడా తప్పుపట్టింది. లాక్డౌన్ ఉంటే పనిలేని వాళ్లు ఐదు రూపాయలు ఎలా తెస్తారని ప్రశ్నించింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో అన్నంపె డుతున్నారని, మిగిలిన రాష్ట్రం లోని వారి పరిస్థితి ఏం కావాలని నిలదీసింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. షెల్టర్ హోమ్స్ వసతులపై వివరణ ఇవ్వండి కరోనా కారణంగా ట్విన్ సిటీస్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్స్ ఎన్ని ఉన్నా యో, వాటిలో వసతులు ఏమున్నాయో తెలియజేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిం చింది. లాయర్ వసుధా నాగరాజ్ రాసిన లేఖను బుధవారం పిల్గా స్వీకరించి పైవిధంగా ఆదేశించింది. ఇటీవలే పుట్టిన పిల్లలు, బాలింతలు షెల్ట ర్ హోమ్స్లో ఉన్నా రని, నేలపై నిద్రించలేక కుర్చీల్లోనే బాలింతులు రోజంతా కూర్చుంటున్నారని, ఆపరేషన్లు చేయించుకున్న రోగుల పరిస్థితి కూడా అదేవి ధంగా ఉందనే పిల్లోని అంశాలపై కూడా వివరణ ఇవ్వాలని హైకోర్టు తేల్చిచెప్పింది.
రేషన్ ఎందుకు ఇవ్వలేదు?
- తెలంగాణం
- April 16, 2020
లేటెస్ట్
- మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
- జూన్ 8న చేప ప్రసాదం..సిద్దమవుతున్న బత్తిని ఫ్యామిలీ
- రాజీవ్ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
- LCU Short Film: లోకేష్ కనగరాజ్ సినిమా ప్రపంచంపై..రాబోతున్న షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదే!
- IPL 2024: తిట్టడమే కాదు.. కొట్టాడు: లక్నో మద్దతుదారుడిపై ముంబై అభిమాని దాడి
- ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు
- కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం
- నార్సింగి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం
- పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి
- ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలను ఏం చేయాలి..?
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!