మణుగూరు మున్సిపాలిటీ ఏర్పాటుపై వివరణ ఇవ్వండి : హైకోర్టు

మణుగూరు మున్సిపాలిటీ ఏర్పాటుపై వివరణ ఇవ్వండి : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరును మున్సిపాలిటీగా మార్చడాన్ని సవాల్‌‌ చేసిన కేసులో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ మున్సిపల్‌‌ యాక్ట్‌‌ 2019, ట్రైబ్యుల్‌‌ యాక్ట్‌‌ ప్రకారం మున్సిపాలిటీగా మార్చడానికి వీల్లేదంటూ కొత్త కొండాపురం, మణుగూరు ప్రాంతాలకు చెందిన కోడి నాగరాజు సహా ముగ్గురు పిటిషన్‌‌ దాఖలు చేశారు.

దీనిని చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ అనిల్‌‌ కుమార్‌‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ గురువారం విచారించింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర సర్కార్‌‌ను ఆదేశించింది.