ఇంటర్ ఫలితాల విడుదలపై ప్రభుత్వానికి రిపోర్ట్ అందించనున్న ఇంటర్ బోర్డ్

ఇంటర్ ఫలితాల విడుదలపై ప్రభుత్వానికి రిపోర్ట్ అందించనున్న ఇంటర్ బోర్డ్

ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఎలాంటి తప్పిదాలు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది.

గత ఏడాది తెలంగాణ ఇంటర్ పరీక్ష పేపర్ల లెక్కింపులు అనేక అవకతవకలు జరిగాయి. దీంతో పదుల సంఖ్యలో విద్యార్ధులు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో  విద్యార్థుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.

గతేడాది ఫలితాల్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో జరిపిన ఇంటర్ పేపర్ల కౌంటింగ్, విడుదలపై జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఇందులో భాగంగా పరీక్ష పేపర్ల లెక్కింపును పూర్తి చేసుకొని.. డబల్ చెకింగ్ ప్రాసెస్ చేస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఫలితాలకు సంబంధించిన రిపోర్ట్ ను రేపు ప్రభుత్వానికి ఇంటర్ బోర్డ్ అందించనుంది. అనంతరం ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదల పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.