ఏప్రిల్ 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు!

ఏప్రిల్ 24న తెలంగాణ ఇంటర్ ఫలితాలు!

 పరీక్ష ఫలితాల కోసం ఇంటర్ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పాసైతమా.. ఫెల్ అయితమా అనే భయంతో విద్యార్థులు.. ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తారని చూస్తుండగా.. ఫలితాలను వెల్లడించడించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఏప్రిల్ 24వ తేదీన ఇంటర్ ఫలితాలను ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది.

ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను ఉదయం 11 గంటలకు వెల్లడించనున్నట్లు తెలిపింది. ఆరోజు విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లో చూసుకోవచ్చని చెప్పింది. 

కాగా,  రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18వ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 9 లక్షలకు పైగా మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4,78,527 మంది ఫస్టియర్ విద్యార్థులు పరీక్షలు రాయగా.. 4,43,993 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాశారు.