లాక్‌డౌన్ ముగిసేదాకా ఆడ్మిష‌‌న్లు తీసుకోవ‌ద్దు: ఇంటర్ బోర్డు

లాక్‌డౌన్ ముగిసేదాకా ఆడ్మిష‌‌న్లు తీసుకోవ‌ద్దు: ఇంటర్ బోర్డు

లాక్ డౌన్ ముగిసే వరకు రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజ్ లు ఏవీ కుడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు తీసుకోవద్దని తెలంగాణ ఇంట‌ర్మీడియేట్ బోర్డు తెలిపింది .పదో తరగతి పరీక్షలు పూర్తి కానందున కాలేజీ లకు బోర్డు ఆఫ్లియేషన్ ఇవ్వలేదని, కాబ‌ట్టి విద్యార్థులు ఎవరు కూడా ఫీజు కట్టి అడ్మిషన్లు తీసుకోవద్దని బోర్డ్ సెక్రటరీ ఒమర్ జలీల్ తెలిపారు. అడ్మిషన్ల ఫీజులు చెల్లించి విద్యార్ధులు నష్టపోవద్దని సూచించారు. ఈ సారి కొన్ని కాలేజీల గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందని, ఏవైనా కాలేజీ లు విద్యార్థుల దగ్గర అడ్మిషన్లు తీసుకంటే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.