ఏప్రిల్‌ 14 వరకు న్యాయవ్యవస్థ లాక్‌డౌన్‌

ఏప్రిల్‌ 14 వరకు న్యాయవ్యవస్థ లాక్‌డౌన్‌

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించిన క్ర‌మంలో తెలంగాణలోనూ న్యాయవ్యవస్థ లాక్‌డౌన్ ను ఏప్రిల్‌ 14 వరకు పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోర్టులన్నీ ఏప్రిల్‌ 14 లేదా తదుపరి ఉత్తర్వులిచ్చే వరకూ లాక్ డౌన్ లో ఉంటాయని తెలిపింది. న్యాయశాఖ ఉద్యోగులు ఇళ్లల్లోనే అందుబాటులో ఉండాలని సూచించింది హైకోర్టు.

అత్యవసర అంశాల కోసం న్యాయమూర్తులు, మేజిస్ట్రేట్ లు రోటేషన్ పై విధుల్లో ఉండాలని హైకోర్టు ఆదేశించింది. రిమాండ్‌, బెయిల్‌ వంటి వీడియో కాన్ఫరెన్స్‌ లేదా స్కైప్‌ ద్వారా చేపట్టాలని తెలిపింది. అత్యవసర పిటిషన్లను ఈమెయిల్‌ ద్వారా దాఖలు చేయాలని తెలిపింది హైకోర్టు.