జూనియర్ పంచాయతీ సెక్రటరీల జీతం పెంపు

జూనియర్ పంచాయతీ సెక్రటరీల జీతం పెంపు

హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల (జేపీఎస్‌) ప్రొబేషన్‌ టైమ్, జీతాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెండేళ్లుగా ఉన్న ప్రొబేషన్‌ను నాలుగేండ్లకు పెంచింది. అలాగే రూ.15 వేలు ఉన్న జీతాన్ని రూ.28,719కి పెంచింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి ఎం రఘునందర్‌‌ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త జీతాలు జులై 1 నుంచే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను పోస్టులను ప్రభుత్వం 2019  ఏప్రిల్ లో భర్తీ చేసింది. అప్పుడు వారి ప్రొబేషన్ టైమ్ ను రెండేళ్లుగా ఖరారు చేసి రూ.15 వేల వేతనాన్ని నిర్ణయించింది. ఈ ప్రొబేషన్ టైమ్ కూడా పూర్తయి 2 నెలలు గడిచింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జేపీఎస్‌ల ప్రొబేషన్ టైమ్ ను రెండేళ్ల నుంచి నాలుగేళ్ల నుంచి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రామాల డెవలప్ మెంట్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.