తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా పీడ ఇంకా వీడడం లేదు. దేశంలో ఉన్నట్టుండి వైరస్ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 12 వేల 249 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. కరోనాతో మరో 13 మంది చనిపోయారు. ఇతర రాష్ట్రాల్లో కూడా అనూహ్యంగా పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. తెలంగాణలో కూడా అదే పరిస్థితి నెలకొంది. సోమవారం 403 కేసులు నమోదయితే.. గత 24 గంటల్లో 434 కేసులు రికార్డు అయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 129 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 7, 90, 347 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 99.15 శాతంగా ఉందని, మొత్తం 27 వేల 754 టెస్టులు నిర్వహించడం జరిగిందని వెల్లడించింది. 

ఏ జిల్లాలో ఎన్ని కేసులు : -

ఆదిలాబాద్ 05, భద్రాద్రి కొత్తగూడెం 01, హైదరాబాద్ 292, జగిత్యాల 01, జనగాం 00, జయశంకర్ భూపాలపల్లి 00, జోగులాంబ గద్వాల 00, కామారెడ్డి 00, కరీంనగర్ 02, ఖమ్మం 05, కొమరంభీం ఆసిఫాబాద్ 00, మహబూబ్ నగర్ 01, మహబూబాబాద్ 03, మంచిర్యాల 04, మెదక్ 00, మేడ్చల్ మల్కాజ్ గిరి 28, ములుగు 00, నాగర్ కర్నూలు 00, నల్గొండ 02, నారాయణపేట 00, నిర్మల్ 00, నిజామాబాద్ 00, పెద్దపల్లి 02, రాజన్న సిరిసిల్ల 00, రంగారెడ్డి 71, సంగారెడ్డి 05, సిద్ధిపేట 02, సూర్యాపేట 07, వికారాబాద్ 01, వనపర్తి 00, వరంగల్ రూరల్ 00, హన్మకొండ 00, యాదాద్రి భువనగరి 02. మొత్తం - 434