దుబాయ్ లో కరోనాతో తెలంగాణ‌ వాసి మృతి

దుబాయ్ లో కరోనాతో తెలంగాణ‌ వాసి మృతి

దుబాయ్ లో తెలంగాణ‌కు చెందిన వ్య‌క్తి క‌రోనాతో మృతి చెందాడు. జగిత్యాల జిల్లా, కొరుట్ల మండలం.. మోహన్ రావు పేట్ కు చెందిన మునిగంటి మల్లేశం.. బతుకు తెరువు కోసం కొన్నేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అయితు ఇటీవ‌ల‌ దగ్గు, జ్వరంతో బాధపడుతున్న మల్లేశంను ట్రీట్ మెంట్ కోసం స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. కరోనా సిమ్స్టమ్స్ కనిపిస్తున్నాయని భావించిన డాక్ట‌ర్లు పరీక్షలు నిర్వహిస్తుండగానే హటర్మణం పొందాడ‌ని, మృతిడికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలిందని తెలిపారు డాక్ట‌ర్లు.

కరోనా వ్యాధితో మరణించిన మల్లేశం మృతదేహం స్వదేశం పంపడానికి వీలులేనందున అక్కడే అంత్యక్రియలు నిర్వహించిన‌ట్లు తెలిపారు స్నేహితులు. విష‌యం తెలిసిన మ‌ల్లేశం కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. ఆర్థిక సమ్యలు గల మల్లేష్ కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు స్నేహితులు.