మహబూబాబాద్ జిల్లా తోర్రూర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక మహిళ కౌన్సిలర్లకు బదులుగా భర్తలు హాజరయ్యారు. దీనిపై మంత్రి ఎర్రబెల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎందుకు వచ్చారు.? ఎవరు ఆహ్వానించారు అంటూ కౌన్సిలర్ల భర్తలపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు రాకుంటే ప్రజలు వీరిని ఎందుకు గెలిపించినట్లని మంత్రి ప్రశ్నించారు. వార్డుల వారీగా కౌన్సిలర్ల వివరాలను అడిగారు. కార్యక్రమానికి రాని కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు మంత్రి ఆదేశాలు జారీచేశారు.
మరిన్ని వార్తల కోసం..
బతుకమ్మ చీరలకు నిప్పు.. ఈ చీరలు కవిత కట్టుకుంటదా?
సమంతకు అక్కినేని ఫ్యామిలీ రూ.200 కోట్లు ఆఫర్?
బడి కూలుతున్నా.. కొత్త బిల్డింగ్ పూర్తి చేస్తలేరు