
గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో 4 డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేశారు. మొత్తం 70 మంది డ్రగ్స్పెడ్లర్స్ పై పక్కా సమాచారంతో దాడి చేశారు. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్స్ తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.1.25 కోట్ల విలువలైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
గోవాలో జరిగిన ఈ దాడిలో పబ్ లలో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు డీజేలు వనిష్ టక్కర్, స్వదీప్ అరెస్ట్ చేశారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న డీజేలను అదుపులోకి తీసుకున్నారు.
గోవాలో ఆల్ఫాజోలం తయారు చేసి తెలంగాణకు సప్లై చేస్తున్న మరో ముఠాను కూడా అదుపులోకి తీసుకున్నారు నార్కోటిక్ అధికారులు. గోవాలోని సూర్యప్రభ ఫార్మా కంపెనీలో భారీగా ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు.
గోవాలో తయారు చేసిన డ్రగ్స్ ను హైదరాబాద్ లో ఇద్దరు డాక్టర్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి హవాలా మార్గంలో డబ్బులు అందుతున్నాయని తెలుస్తోంది.