దళిత బంధు పెట్టినా కేసీఆర్‌‌ను ప్రజలు నమ్మలే

దళిత బంధు పెట్టినా కేసీఆర్‌‌ను ప్రజలు నమ్మలే

హుజురాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండానే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హుజురాబాద్‌ బై ఎలక్షన్ కౌంటింగ్‌లో రౌండు రౌండుకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మెజారిటీ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ భారీ విజయం సాధించడం ఖాయమన్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టడం నిశ్చయమని అన్నారు. ‘‘ఈటల రాజేందర్ బీజేపీ నాయకుడు. ఈటల గెలుపు బీజేపీ గెలుపు.. బీజేపీ గెలుపు ఈటల గెలుపే” అని బండి సంజయ్ చెప్పారు. సీఎం కేసీఆర్‌‌పై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోయిందని అన్నారు. హుజురాబాద్ ఎన్నికల ముందు దళిత బంధు పథకం పెట్టి అమలు చేసినా ఆయనను ప్రజలు నమ్మలేదని చెప్పారు.