
పద్మారావునగర్, వెలుగు : సుప్రీంకోర్టు ఆదేశాలతో 17 ఏండ్ల తర్వాత తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్(టీఎస్ఎంసీ) ఎన్నికలు జరుగుతున్నాయని.. పోస్టల్ బ్యాలెట్ పేపర్ల పంపిణీ ముగిసిందని ఇండిపెండెంట్ అభ్యర్థి, ఆరోగ్య శాఖ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ జి. హనుమాండ్లు తెలిపారు. ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ను నవంబర్ 30లోగా చేరేటట్లు రిజిస్టర్ పోస్టు ద్వారా రిటర్నింగ్ఆఫీసర్కు పంపాల్సి ఉంటుందని శనివారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
టీఎస్ఎంసీ ఓటర్ల జాబితాలో పేరు ఉండి బ్యాలెట్ పేపర్అందని ఓటర్లు తమ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కాపీని, అడ్రస్ ఫ్రూఫ్ కోసం ఆధార్ కార్డు కాపీని జతపరిచి డూప్లికేట్ బ్యాలెట్ పేపర్ కోసం రిటర్నింగ్ఆఫీసర్కు రిక్వెస్ట్ పంపవచ్చని వివరించారు. ప్రయాసతో కూడిన ఈ ఓటింగ్ పద్ధతి వల్ల ఎంతో మంది డాక్టర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపకపోవడం కొందరు అభ్యర్థులకు ప్రయోజనకరంగా మారిందన్నారు.
వారు ఓటర్ల నుంచి బ్యాలెట్ పేపర్లను సేకరించి తమకు అనుకూలంగా ఓట్లు వేసుకొని రిటర్నింగ్ఆఫీసర్కు పంపుతున్నట్లు తెలిసిందన్నారు. మేధావులైన డాక్టర్లు ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. టీఎస్ఎంసీ పనితీరులో మార్పు తీసుకురాగల డాక్టర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హనుమాండ్లు కోరారు.