- బుద్ధవనం, నేలకొండపల్లి, దూళికట్ట బుద్ధిస్ట్ సర్క్యూట్గా తీర్చిదిద్దుతాం
- పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్
హైదరాబాద్, వెలుగు: దేశం నలుమూల నుంచి వచ్చే పర్యాటకులతోపాటు విదేశీ టూరిస్ట్ల సేఫ్టీ, సౌకర్యాలపై స్పెషల్ఫోకస్పెట్టినట్టు పర్యాటక, భాషా సాంస్కృతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్లో దాదాపు1000 నుంచి 5000 వరకు టాయిలెట్స్, రెస్ట్రూమ్స్నిర్మించనున్నట్టు చెప్పారు. ఈ మేరకు మంగళవారం సెక్రటేరియెట్లో ఆమె మాట్లాడారు. హైదరాబాద్ సిటీ అంతర్జాతీయ వ్యాపార సదస్సులు, కాన్ఫరెన్స్లు, ఫ్యామిలీ వెకేషన్లు, సాంస్కృతిక పర్యాటకానికి ప్రధాన కేంద్రమని, పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలిగేలా ‘కస్టమైజ్డ్టూరిజం’పై ఫోకస్ పెట్టామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 250కిపైగా డెస్టినేషన్ ప్రాంతాలను గుర్తించామని ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అత్యాధునిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. రాష్ట్రంలో వెడ్డింగ్డెస్టినేషన్లకు డిమాండ్ పెరుగుతుందని వివరించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు నేరుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. బుద్ధవనం, నేలకొండపల్లి, దూళికట్ట బౌద్ధక్షేత్రాలకు పర్యాటకుల తాకిడి పెరిగిందన్నారు.
వీటితోపాటు మరిన్ని ప్రాంతాలను ప్రత్యేక సర్క్యూట్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అపారమైన హెరిటేజ్ సంపద ఉందని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో హోంస్టేలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని, ఆ దిశగా ఇంటి యాజమానులను ప్రోత్సహించాలని సూచించారు. ఇవి పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని, తక్కువ ఖర్చుతో కూడిన సురక్షితమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని చెప్పారు.
