ప్రపంచానికి తెలంగాణ ఆహార గుర్తింపు : ఫుడ్ స్టార్టప్ లకు ప్రోత్సాహకం

ప్రపంచానికి తెలంగాణ ఆహార గుర్తింపు : ఫుడ్ స్టార్టప్ లకు ప్రోత్సాహకం

రాష్ట్రంలో పండే ప్రతి పంటకు, ప్రతి సంప్రదాయ ఆహారానికి ప్రపంచ వేదిక కల్పించేందుకు ప్రభుత్వం చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్​ వేదికగా ‘తెలంగాణ కలినరీ ఎక్స్‌‌‌‌పీరియెన్షియల్ టూరిజం యాక్సిలరేటర్(టీసీఈటీఏ) వంటలో నైపుణ్యం, సృజనాత్మకత’ను ప్రారంభించనున్నది.‘ప్రపంచానికి తెలంగాణ ఆహార గుర్తింపు’ అనే అంశంపై ఈ వేదికపై చర్చించనున్నారు. తెలంగాణ వంటకాల రుచి పరీక్షలు కూడా ఏర్పాటు చేశారు.

ఇండో- డచ్ సహకారంతో..

ఇండో–- డచ్ సహకారంతో తెలంగాణ రుచులను ప్రపంచ వేదికకు  పరిచయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నెదర్లాండ్స్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ (ఎన్‌‌‌‌ఐసీసీటీ).. ‘తెలంగాణ కలినరీ ఎక్స్‌‌‌‌పీరియెన్షియల్ టూరిజం యాక్సిలరేటర్’ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నది. ఈ సందర్భంగా ఎన్‌‌‌‌ఐసీసీటీ అధ్యక్షురాలు డాక్టర్ ఎడిత్ నార్డ్‌‌‌‌మాన్ మాట్లాడుతూ.. ఆహార పర్యాటకం అనేది వ్యవసాయం, ఇన్నోవేషన్, కల్చర్​ను ఏకం చేసే ఆర్థిక యంత్రాంగమని పేర్కొన్నారు. తెలంగాణ విజన్,​ నెదర్లాండ్స్ స్థిరమైన అగ్రి-టెక్, ఫుడ్​టెక్నాలజీ కలిస్తే రెండు దేశాల్లోని స్టేక్​హోల్డర్లకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఫుడ్​ స్టార్టప్​లకు ప్రోత్సాహకంగా 

ఫుడ్-టెక్, డ్రింక్స్ రంగాల్లో స్టార్టప్‌‌‌‌లను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణను అంతర్జాతీయ ఆహార కేంద్రంగా తీర్చిదిద్దడం. రైతుల ఆదాయాన్ని పెంచే స్థిరమైన వ్యాపార నమూనాలను సృష్టించడం దీని ఉద్దేశం. ఈ కలినరీ యాక్సిలరేటర్ చొరవతో రైతులు, స్థానిక చెఫ్‌‌‌‌లు, ఫుడ్‌‌‌‌-టెక్‌‌‌‌ స్టార్టప్‌‌‌‌లు, దేశ విదేశీ పెట్టుబడిదారులను ఏకీకృతం చేసి వంటల ఆధారంగా సుస్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించే సమగ్ర వేదికగా టీసీఈటీఏ రూపుదిద్దుకోనుంది. అంతేకాదు, రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, ఇన్నొవేషన్ రంగాలన్నీ ఏకీకృతం కానున్నాయి. ఆతిథ్య రంగానికి వేదికగా తెలంగాణ నిలవనున్నది.